Read more!

నటుడు మంచు మోహన్‌ బాబుకు పితృవియోగం

 

 

 

 

 

ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు తండ్రి మంచు నారాయణస్వామినాయుడు ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. తిరుపతి శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలోని ఆయన నివాసంలో మృతి చెందారు. నారాయణ స్వామి నాయుడు వయస్సు 95 సంవత్సరాలు. నారాయణస్వామినాయుడుకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గతంలో నారాయణస్వామి నాయుడు హెడ్‌మాస్టర్‌గా సేవలందించారు. నారాయణ నాయుడు మృతికి బంధువులు, అత్మీయులు, పలు రాజకీయవేత్తలు సంతాపం తెలిపారు.

 

”మా తాత మంచి మనుసున్న వ్యక్తి. ఆయన రాత్రి 12.10 గంటలకు చనిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మా తాతయ్యను మేము మిస్ అయ్యాం” అని మంచు మనోజ్ ట్వీట్ చేయగా, ”95 ఏళ్లు అధ్బుతమయిన జీవితం గడిపారు. ఉపాధ్యాయుడిగా మీ సేవలు చిరస్మరణీయం. తాతయ్య మిమ్మల్ని మిస్ అయ్యాం” అని మంచు లక్ష్మీప్రసన్న ట్వీట్ చేశారు.